🔥 TRENDING પોરબંદરનાં કુતિયાણા વિસ્તારમાં વરસાદનુ... વરસાદી મોસમમાં વિજયનગરમાં ખેડુતોને મળ્... இடைத்தேர்தலில் கம்யூனிஸ்ட் கட்சிகள் தன... Karnataka Schools Closed on September... Political Tensions Escalate in Karnata... Rajasthan SET 2026: Expected Cut‑Off M...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

పింఛన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

✍️ Reporter: TELU NARESH 🗓 14 Sep 2026, 10:05 AM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

September 14

తెలంగాణలో కొత్త పించన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. కొత్త పింఛన్ల పంపిణీకి రేవంత్ సర్కార్ ముహూర్తం ఖారారు చేసింది. దసరా కానుకగా కొత్త పింఛన్లను అందించనుంది. కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల నూతన పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అర్హుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించింది. లక్షల మంది దరఖాస్తులు చేసుకోగా.. వీరిలో అసలైన అర్హులను ఎంపిక చేయాల్సి ఉంది. దరఖాస్తు చేసుకున్నవారి ఇంటికి అధికారులు నేరుగా వెళ్లనున్నారు. వారికి నిజంగా అర్హత ఉందా.. లేదా అనే వివరాలు పరిశీలించనున్నారు. ఈ నెలాఖరు వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం వచ్చే నెల తొలివారంలో అర్హులను ఎంపిక చేసి జాబితా సిద్దం చేయనున్నారు.
మీ
తేలు నరేష్ ముదిరాజ్ 299 డివిజన్ గుండ్ల పోచంపల్లి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మునీరాబాద్
📲Get App