హుజూర్ నగర్: కార్మిక కుటుంబాలకు ఈ-శ్రమ్ అండ
కార్మిక కుటుంబాలకు ఈ-శ్రమ్ ఇన్సూరెన్స్ అండగా నిలుస్తుందని తెలంగాణ రీజినల్ డైరెక్టర్ ఎం.ఆర్. దేశ్ పాండే అన్నారు. బుధవారం పట్టణంలో జాతీయ కార్మిక విద్యా దినోత్సవం సందర్భంగా ఈ-శ్రమ్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ తో కలిసి దేశ్ పాండే 100 మంది అసంఘటిత కార్మికులకు కార్డులు అందజేశారు. కార్మికులు తమ హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.