Viral & Trending
హుజూర్నగర్లో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు
హుజూర్నగర్ ఓపెన్ ఐస్ సొసైటీ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని సీఐ చరమందరాజు ప్రారంభించారు. పర్యావరణం, నీటి వనరుల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను వినియోగించాలని CI కోరారు. మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగి పర్యావరణానికి హాని కలిగించవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు శ్రీకాంత్ గౌడ్, ప్రవీణ్ బాబు, గోపాల్ రెడ్డి, కోటేష్, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.