నల్గొండ: బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ శిక్ష పడింది
2023లో నమోదైన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ POCSO న్యాయస్థానం నిందితుడు ఎస్.కే. ఖయ్యూంను దోషిగా తేల్చింది. POCSO చట్టం కింద 23 ఏళ్ల జైలు శిక్ష, SC/ST చట్టం కింద యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధించింది. శిక్షలన్నీ ఏకకాలంలో అమలు చేయాలని, బాధితురాలికి రూ.7లక్షల పరిహారం అందించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది.