ఎంవీఎస్ కళాశాలను తెలంగాణలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దుతాం
మహబూబ్ నగర్ ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవన నిర్మాణానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేలాది మంది శాస్త్రవేత్తలు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులను అందించిన ఘనత ఎంవీఎస్ కళాశాలకు ఉందన్నారు. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ కళాశాలను సుమారు ₹70 కోట్లతో సమగ్ర ఇంటిగ్రేటె బిల్డింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించామని, అందులో భాగంగా తొలి విడతగా ₹20.50 కోట్లతో నేడు శంకుస్థాపన, భూమిపూజ చేస్తున్నట్లు తెలిపారు.