🔥 TRENDING Kanak News airs 7PM bulletin covering... Dr. Satish Poonia bows at Shri Darbar... ਜਲਾਲਾਬਾਦ ਵਿੱਚ ਦਿਨ ਦਿਹਾੜੇ ਮੋਟਰਸਾਈਕਲ ਚੋਰ... ગીરગઢડા પોલીસની સર્વેલન્સ ટીમે દ્રોણ ગ... ગુજરાત કેબિનેટમાં 10 મહત્વપૂર્ણ પ્રોજે... ਪਟਿਆਲਾ ਵਿੱਚ PRTC ਬੱਸ ਅਤੇ ਰੈਪੀਡੋ ਬਾਈਕ ਦ...
03 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
అక్టోబర్ 7 నా అమరావతిలో జరిగే MRPS, MSP మండలాల జాతీయ సదస్సును విజయవంతం చేయాలి

అక్టోబర్ 7 నా అమరావతిలో జరిగే MRPS, MSP మండలాల జాతీయ సదస్సును విజయవంతం చేయాలి

✍️ Reporter: Akarapu kondalu 🗓 03 Sep 2026, 07:34 AM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*03-09-2026,*
*గరిడేపల్లి, నేరేడుచర్ల,*
*హుజూర్ నగర్ , పాలకీడు మండలాల సన్నాహక సమావేశం*

*అక్టోబర్ 7 న అమరావతి లో జరిగే MRPS, MSP మండలాల జాతీయ సదస్సును విజయవంతం చేయాలి*

*ఆర్థిక, రాజకీయ సమానత్వం సాంఘిక అసమానతలు, లింగ, వివక్షతలు లేని సమసమాజ నిర్మాణానికై సిద్ధం కండి*

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు *పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపుమేరకు* హుజూర్ నగర్ నియోజకవర్గం, గరిడేపల్లి మండల కేంద్రంగా ఎస్వీ ఫంక్షన్ హాల్ నందు గరిడేపల్లి, హుజూర్నగర్,నేరేడుచర్ల, పాలకీడు నాలుగు మండలాల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, ఎందరో మాదిగ అమరవీరుల ప్రాణాత్యాగాల ఫలితంగా SC వర్గీకరణ సాధించడం జరిగిందని, సాధించిన వర్గీకరణ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలంటే విద్య పరంగా, రాజకీయపరంగా, ఆర్థికపరంగా జాతిని మేల్కొలిపి ఐక్యత చేయవలసిన అవసరం ఉంది అని, ఆ కార్యక్రమంలో భాగంగానే *అక్టోబర్ 7న అమరావతి లో మండలాల జాతీయ సదస్సు నిర్వహించడం జరుగుతుందని *కార్యక్రమానికి ఎస్సీ వర్గీకరణ ప్రదాత, ఆరోగ్యశ్రీ,వికలాంగుల పింఛన్, సబ్బండ వర్గాల ఆశ జ్యోతి అయినా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ* ముఖ్యఅతిగా పాల్గొంటారని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో MRPS, MSP మండలాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు, మండల కమిటీ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా సీనియర్ నాయకులు జిల్లా మాజీ కన్వీనర్ ఏపూరి రాజు మాదిగ, ఎంఎస్పి జిల్లా మాజీ కార్యదర్శి ఎడవెల్లి చంద్రయ్య మాదిగ, గరిడేపల్లి మండల అధ్యక్షులు కొత్తపల్లి రవి మాదిగ, నేరేడుచర్ల మండల అధ్యక్షులు ఎడవెల్లి అరుణ్ మాదిగ, హుజూర్నగర్ మండల అధ్యక్షులు మెరిగ మట్టపల్లి మాదిగ, ఎమ్మెస్పీ నేరేడుచర్ల మండల అధ్యక్షులు మచ్చ శ్రీను మాదిగ, ఎమ్మార్పీఎస్, msp హుజూర్నగర్ మండల అధ్యక్షులు గుండెపంగు బాబు మాదిగ, జిల్లా సీనియర్ నాయకులు ఎడవల్లి బాటసారి, హుజూర్నగర్ , ప్రధాన కార్యదర్శి పోలే శ్యామ్, చిల్ల అశోక్, మండల అధికార ప్రతినిధి విజయ్ కుమార్,ఉపాధ్యక్షులు దూరే వినోద్, ప్రచార కార్యదర్శి అలంపల్లీ శేఖర్, msp మండల ఉపాధ్యక్షులు కొత్తపల్లి పవన్, గ్రామ అధ్యక్షులు పిట్ట వెంకటేష్,జై భీమ్ కమిటీ ప్రధాన కార్యదర్శి నకిరేకoటి రవి, ప్రచార కార్యదర్శి మంద శేఖర్,పరెడ్డిగూడెం అధ్యక్షులు పిట్ట సత్యం, బచ్చలకూరి నాగార్జున,పిట్ట నాగరాజు, దేవరకొండ కరుణాకర్, పాల్వాయి మధు, ఆరే శ్రీకాంత్, నందిపాటి బోయజ్, వల్లపు దాసు సాయి శ్రీను, ఇంజమూరి పున్నయ్య, అమరారపు మహేష్, రవి, నకిరేకంటి సతీష్, ఒట్టేపు మధు,నందిపాటి కనకయ్య, సాయి మొదలైన వారు పాల్గొన్నారు.
📲Get App